<p>Big Trishul to Be Installed At Kailasagiri in Visakhapatnam: విశాఖలోని కైలాసగిరిపై త్వరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే శివపార్వతులతో పర్యటకులను ఆకర్షిస్తున్న కైలాసగిరిపై వీఎంఆర్డీఏ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని పొడవు 65 అడుగులు కాగా అందులో ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. తుపాన్లు, ప్రచండ గాలులనూ తట్టుకునేలా దీన్ని నిర్మించారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కనిపించేలా ఎత్తయిన కొండపై దీన్ని నిర్మించారు. రాత్రి వేళ త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల 110 వాట్స్ ఎల్ఈడీ దీపాలు అమర్చారు. రూ.2.50 కోట్లతో ‘త్రిశూల్ ప్రాజెక్టు’ చేపట్టారు. సాగరతీర నగరం విశాఖకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు. పర్యాటకుల్ని మరింతగా ఆకర్షించేందుకు ప్రభుత్వం గ్లాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రారంభించింది. అలాగే కైలాసగిరిపై రోప్వే, స్కై సైక్లింగ్, జిప్ లైనర్ వంటివి పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి.</p>
