<p>Cricket Betting Gang Arrested In Visakhapatnam: ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 24 మంది అంతరాష్ట్ర ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో 500 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు విశాఖ సీపీ శంఖ బ్రత బాగ్చి వెల్లడించారు. మరో రూ.1000 కోట్ల వరకూ లావాదేవీలు జరిగిఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 24 మంది ముఠా సభ్యులలో 8 మందిని కలకత్తాలో అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితులు నుంచి 234 బ్యాంక్ అకౌంట్లు గుర్తింనట్లు సీపీ చెప్పారు. బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన బాధితులకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసానిచ్చారు.</p><p>ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 24 మంది అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని, ఈ వ్యవహారంలో 500 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీపీ శంఖ బ్రత బాగ్చి తెలిపారు. అంతేకాకుండా మరో వెయ్యి కోట్ల వరకూ లావాదేవీలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ముఠా సభ్యులలో 8 మందిని కలకత్తాలో అరెస్టు చేశామని, నిందితులు నుంచి 234 బ్యాంక్ అకౌంట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన బాధితులకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.</p>
