Surprise Me!

'హృదయాకారం' మనసుకు ఆనందకరం - తెలంగాణలో తొలి గాజు వంతెన

2026-05-24 9 Dailymotion

<p>Telangana First Glass Bridge Built in Yellamma Cheruvu in Husnabad : తెలంగాణలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో రెడీ అవుతోంది. కాకతీయుల కాలంనాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీని నిర్మాణం అత్యంత అద్బుతంగా రూపుదిద్దుకుంటోంది. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి గాజు వంతెన ఇదే కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి భారీగా ప్రజలు వస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ డ్రోన్ కెమెరా దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హుస్నాబాద్​ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో నియోజకవర్గానికి సులభంగా నిధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే విధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు రకాల సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. </p>

Buy Now on CodeCanyon