Surprise Me!

రాజధాని భవనాల ఖర్చుపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: మంత్రి నారాయణ

2026-06-13 1 Dailymotion

<p>Minister Narayana Visited The Capital Amaravati : అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఉద్యోగుల గృహ సముదాయానికి అయ్యే ఖర్చు కన్నా రాజధానిలో నిర్మిస్తున్న నివాస భవనాలకు వెచ్చిస్తోంది తక్కువేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ ఉద్యోగుల గృహ సముదాయానికి కేంద్రం చదరపు అడుగుకు చేస్తున్న ఖర్చు కన్నా అమరావతిలో చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు తక్కువేనని లెక్కలతో వివరించారు. కేవలం ఐకానిక్‌ భవనాలకు మాత్రమే ఎక్కువ వెచ్చిస్తున్నామన్నారు. దిల్లీలోని పార్లమెంట్‌, తెలంగాణ సచివాలయంతో పాటు అనేక భవనాలకు ఖర్చు చేసినట్లే అమరావతిలోనూ చేస్తున్నామని తెలిపారు. రాజధాని భవనాల ఖర్చులపై వైఎస్సార్సీపీ అనవసర దుష్ప్రచారాలు ఆపకపోతే ఈసారి సున్నాకే పరిమితం అవుతారని హెచ్చరించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనలను నారాయణ పరిశీలించారు. వచ్చే ఏడాది వర్షాకాలంలోపు 69 వంతెనలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. </p>

Buy Now on CodeCanyon