<p>ETV Interview With State Civil Supplies Minister Nadendla Manohar : రాష్ట్రంలో పౌరసరఫరాల రంగంలో ఆచరణాత్మక మార్పులు తీసుకువచ్చామని, రానున్న కాలంలో కూడా రాష్ట్రంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మాత్రం రైతులకు కేవలం 24 గంటల్లోనే వారి ఖాతాలకు ఆ మొత్తాలను జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంతేకాకుండా స్మార్ట్ కార్డుల విధానం కూడా మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. కూటమి ధర్మానికి సమస్యలనేవి ఎక్కడా అడ్డంకి కాకుండా వ్యవహరించడం వల్ల, ప్రజలకు మంచి సేవలను అందించడమే లక్ష్యంగా రానున్న మూడు సంవత్సరాల్లో కొనసాగుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో ఈటీవీ-భారత్ ముఖాముఖి.</p>
