Surprise Me!

గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం: కేంద్రమంత్రి పెమ్మసాని

2026-07-02 1 Dailymotion

<p>Pemmasani Chandrashekar About VBG RAM G : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరాం జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా గురువారం ప్రారంభించారు. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారికంగా ప్రారంభించారు. ఉపాధిహామీ పథకంలో లోపాలను సరిచేసి, పల్లె ప్రజలకు మెరుగైన లబ్ధి చేకూర్చడమే వీబీ జీ రామ్‌జీ లక్ష్యమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉన్నా అమలు పక్కాగా ఉన్నప్పుడే నిజమైన పేదలకు మేలు జరుగుతుందన్నారు. అందుకే కేంద్రప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ ద్వారా సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ సారథ్యంలో ఈ పథకం అద్భుతంగా అమలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.</p>

Buy Now on CodeCanyon