<p>Deputy CM Pawan Kalyan Visits Tirumala Temple : తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అంతకుముందు గాయత్రి నిలయం అతిథి గృహంకు చేరుకున్న పవన్ కల్యాణ్కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్కు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి డిప్యూటీ సీఎం పవన్కు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. </p><p>సాయంత్రం ఆపన్న హృదయ స్కీమ్ విరాళం దాతల దర్శన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన పవన్ కల్యాణ్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈవో వెంకయ్య చౌదరి పవన్కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేసారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఆలయం ఎదుట పలువురు గుమిగూడారు. పవన్ కల్యాణ్తో పాటు తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శివశ్రీనివాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. </p>
