<p>Eenadu FM 8th Anniversary Celebrations : ఈనాడు ఎఫ్ఎమ్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు ఎఫ్ఎమ్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఉద్యోగులు, ఆర్జేలు, సాంకేతిక, మార్కెటింగ్ సహా వివిధవిభాగాల సిబ్బంది పాల్గొని సంస్థ విజయ ప్రయాణాన్ని వివరించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వినూత్నకార్యక్రమాలు, మధురమైన సంగీతంతో శ్రోతల ఆదరణ పొందుతున్నట్లు తెలిపారు "స్వరాల ద్వారా హృదయాలను కలుపుతూ శ్రోతల అభిమానమే తమ బలం" అనే సందేశంతో తమ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి తెలంగాణలోని వరంగల్ నుంచి ప్రసారాలు అందిస్తున్న ఈనాడు ఎఫ్ఎమ్ తెలుగు రేడియో స్టేషన్లలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టేషన్గా గుర్తింపు పొందింది. నగరంలోని తాజా పరిణామాలు, మహిళా సాధికారత, పుస్తక పఠనం, వినోదాత్మక కార్యక్రమాలు, ఆటలు, యువతతో పాటు అన్ని వర్గాల శ్రోతలను ఆకట్టుకునే ప్రత్యేక షోలతో ఈనాడు ఎఫ్ఎమ్ తన ప్రత్యేకతను కొనసాగిస్తోందని నిర్వాహకులు తెలిపారు. </p>
