<p>Heavy Tourist Rush At Bapatla Beach: బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో చీరాల, వేటపాలెం, వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం వద్ద సముద్ర స్నానాల కోసం జనం పోటెత్తారు. రంజాన్ ఉపవాస ప్రార్థనలు ముగియడంతో ముస్లింలు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సముద్ర తీరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మరోవైపు జిల్లాలోని తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పోలీసులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బీచ్ల వద్ద డ్రోన్లు ఎగురవేసి నిఘా పెడుతున్నారు. బీచ్లకు వారాంతంలో వేలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. హైదరాబాద్కు దగ్గరగా ఉండటంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, యువత ఎక్కువగా వస్తున్నారు. బీచ్లో స్నానాలు చేసేటప్పుడు విద్యార్థులు, యువత ఉత్సాహంగా లోతుకెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను నియమించి, బీచ్లలో పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారు. </p>
