<p>International Dragon Boat League Competitions In Rajamahendravaram : అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలకు రాజమహేంద్రవరం వేదిక కాబోతోంది. మే 30 నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ డ్రాగన్ పోటీల లోగోను ఆవిష్కరించారు. కయాకింగ్, కెనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో 12 దేశాల క్రీడాకారులు అనేక మంది అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలలో ఎంతో చురుకుగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో అనేక మంది పాల్గొనడం గమనార్హం. లోగో ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పురందేశ్వరి మాట్లాడారు. అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలతో మొత్తం దేశంలోనే రాజమహేంద్రవరానికి క్రీడారంగంలోనూ ప్రత్యేకంగా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఆమె అభిప్రాయ పడ్డారు. మళ్లీ వచ్చే పుష్కరాల నిర్వహణకు ఈ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు సన్నాహకంగా నిలుస్తాయని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. </p>
